ప్రాణం పోసుకున్న శిల్పానివని తెలుసుకున్నాను ..
ఓ కవి నాతో మాట్లాడుతూ .............
"మాట్లాడే మల్లెను చూశానురా " అన్నాడు
కోతలు కోస్తున్నాడు అనుకున్నాను .
నేలమీద జాబిల్లిని చూశానన్నాడు.
జాలి వేసింది వీడికేదో అయిందని
నడిచే శిల్పాన్ని చూశానన్నాడు.
శిల్పాన్ని చూపించి నడిపించమన్నాను .
నది అలలు పర్వతాల వైపు పారుతున్నాయన్నాడు.
నన్ను పిచ్చోడిని చేశాడనిపించింది .
సూర్య కాంతిలో చంద్రుడగుపడని రాత్రిని చూశానన్నాడు.
"పగటి కలలు అలాగే వుంటాయిరా " అన్నాను.
నేరేడు పళ్ళని .... శబ్దం రాకుండా తోరణాల తలుపులు కనువిందు చేస్తున్నాయన్నాడు.
వీడికి పిచ్చిపట్టిందనుకున్నాను .
నా నిర్ణయం పూర్తికాకముందే ...
కదిలే కాలం తో పాటు ...... కోయిల స్వరం సాగి నన్ను చేరింది .
అదిగో .... నేను చెప్పిన "అజంతా శిల్ప సుందరి" అని
ఆకాశంలోకి గంతేశాను.
ఎదురుగా చూస్తే నువ్వే .....
వాడు చూసిన " రాతిరిని" నల్లని నీ కురులలో చూశాను .
వాడిని కనువిందు చేసిన " ఆ నేరేడు పళ్ళని " నీ కళ్ళలో చూశాను .
మెలికలు తిరిగిన నడువొంపు లలో "నది అలలు" చూశాను .
యింతసేపు నీ గురించి చెప్పిన ఆ కవి " నా అంతరాత్మ "
నిన్ను చూడక ముందు
నీ గురించి చెప్పిన వన్ని గొప్ప , అని అనుకున్నవన్నీ .....
నిన్ను చూడగానే తను చెప్పింది చాలా తక్కువనిపించింది.
శిల్పానికి కూడా ప్రాణం పోయొచ్చు అని.... కాదు కాదు
ప్రాణం పోసుకున్న శిల్పనివి నీవు అని తెలుసుకున్నాను .
BY
Vశ్వనాధ రెడ్డి